Wednesday, August 22, 2018

"రుబాయియత్ అఫ్ ఒమర్ ఖైయం" బృహద్గ్రంధానికి అచ్చ-తెలుగు పద్య ప్రశంస


శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు 1932లో ఒమర్ ఖైయం రుబాయీలను మరియు వాటికి ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్ రచించిన ఆంగ్లానువాదాలను సంస్కృతము, అచ్చ-తెలుగు భాషలలోకి అనువదించారు. మూల పాఠము దాని ఆంగ్లానువాదముల తులనాత్మక పరిశోధన ఆ అనువాదాల లక్ష్యము. ఆ బృహద్గ్రంధము అనేక పండిత ప్రశంసలు అందుకుంది. The Hyderabad Bulletin అనే ఆంగ్ల పత్రిక 1937 జనవరి 16న సంపాదకీయంగా ప్రచురించిన సమీక్షను ఈ బ్లాగులో 2010 అక్టోబరు 28న ప్రచురించాము. ఆ గ్రంధాన్ని ప్రశంసిస్తూ శ్రీ నిడదవోలు వేంకటరావు గారు అచ్చ-తెలుగులో రచించిన పద్యాలను ఈ దిగువన ఇస్తున్నాము.